fvz

Tuesday, June 16, 2020

Andhra Pradesh 2020 - 2021 Budget Features || We have fulfilled 77 guarantees out of 129, another 39 guarantees are under consideration - AP Governor Biswabhushan Harichandan



  • ఏడాదిలో సంక్షేమ పథకాల కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేశాం.
  • వివిధ పథకాల కింద 3.98 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాం.
  • గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12శాతం వృద్ధిగా నమోదయింది.
  • 129 హామీల్లో 77 హామీలు నెరవేర్చాము. మరో 39 హామీలు పరిశీలనలో ఉన్నాయి.
  • 1060 కొత్త 108, 104 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి.
  • నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15337 కోట్లు కేటాయించాం.
  • వైఎస్సార్‌‌ రైతుభరోసా పథకం మొదటి దశ పూర్తయిందిరూ.12,500 ఇస్తామని చెప్పినప్పటికీ.. దీన్ని రూ.13,500లకు పెంచాం.
  • నాడు-నేడు మనబడి కార్యక్రమం కింద మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తాం
  • ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీని కోసం రూ.1534 కోట్లు ఖర్చు చేశాం.
  • విద్యార్థులకు పౌష్టికాహారం కోసం జగనన్న గోరుముద్ద పథకం. దీనికోసం 1105 కోట్లు ఖర్చు చేశాం
  • జగనన్న వసతి దీవెన కింద 18.51 లక్షల మందికి లబ్ధి. దీనికోసం 3857 కోట్లు ఖర్చు చేశాం.
  • వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద 1.06 లక్షల మందికి లబ్ధి. దీని కోసం రూ.72.82 కోట్లు ఖర్చుచేశాం.
  • వైఎస్సార్‌ కంటివెలుగు కింద 67.69 లక్షల మందికి లబ్ధి. దీని కోసం 53.85 కోట్లు ఖర్చు చేశాం.
  • గ్రామసచివాలయాల్లో 12వేల వైఎస్సార్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
  • నాడు-నేడు కింద ఆస్పత్రులను ఆధునీకరించేందుకు రూ.15,337 కోట్లు కేటాయించాం.
  • మొదటి దశలో 49.44 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ రూ.10,209.32 కోట్లు ఖర్చు చేశాం.
  • కౌలురైతులకు కూడా ప్రయోజనం కల్పిస్తూ చర్యలు చేపట్టాం.
  • ప్రతి గ్రామసచివాలయంలోనూ రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం.
  • వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి నియోజకవర్గస్థాయిలో 147 వైఎస్సార్‌ వ్యవసాయ ప్రయోగశాలలను ఏర్పాటు చేశాం.
  • జిల్లాస్థాయిలో 13 ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేశాం.
  • పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, కరువు పరిస్థితులను అధిగమించేందుకు రూ.2వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  
  • రూ.7వేల కోట్లతో 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తున్నాం, మహిళల పేరిట ఈ స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం.
  • నాలుగేళ్లలో 25 లక్షల గృహాలను సమకూరుస్తాం.
  • 15 లక్షల ఇళ్లకు సంబంధించి ఆగస్టులో పనులు ప్రారంభమవుతాయి.
  • కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.
  • 11,158 గ్రామ సచివాలయాలు, 3876 వార్డు సచివాలయాలున్నాయి..
  • ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం 2వేల మంది అవసరాలను తీరుస్తున్నాయి..
  • ఒక్కో సచివాలయంలో 10 మంది శాశ్వత సిబ్బంది, 40 మంది వాలంటీర్లు ఉన్నారు.
  • సున్నావడ్డీ పథకంతో 91 లక్షల మందికి ప్రయోజన చేకూరనుంది.
  • 45-60 మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.75వేల ఆర్ధికసాయం చేస్తున్నాం. 
  • రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళల సాధికారిత కోసం నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50శాతం రిజిర్వేషన్లు కల్పించాం.
  • 51,400 మంది ఉద్యోగులను ప్రజా రవాణా శాఖలోకి తీసుకుంటూ ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం.
ప్రాజెక్టుల గురించి..
  • జలయజ్ఞం కార్యక్రమం ద్వారా ఉద్దేశించిన 54 సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో 14 ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేశాం‌. 
  • మిగిలిన ప్రాజెక్ట్ పనులు పురోగతిలో ఉన్నాయి.
  • ఈ ఏడాది పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్‌, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, వంశధార రెండోదశ, వంశధార-నాగావళి అనుసంధానం, అవుకు రెండో సొరంగం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాం.

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ది గురించి


  • విద్యుత్‌ బకాయిలకు సంబంధించి డిస్కంలకు రూ. 17904 కోట్లు కేటాయించాం.
  • ఏపీఐఐసీ ద్వారా 1466పైగా కంపెనీలకు భూములు కేటాయించాం.
  • దీని ద్వారా 36810 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.11548 కోట్ల పెట్టుబడులు వస్తాయి.
  • చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం వైఎస్‌ఆర్‌ నవోదయ పథకాన్ని ప్రారంభించాం.
  • భోగాపురం, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు పనులను వేగవంతం చేశాం.
  • జీఎంఆర్‌ సంస్థతో రూ.2,300 కోట్ల మేర భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం.
  • రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు కొత్త ఓడరేవుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం.
  • 3200 కోట్ల వ్యయంతో మూడేళ్లలో 8 చేపలు పట్టే ఓడరేవులను నిర్మిస్తాం.
రివర్స్‌ టెండరింగ్‌ గురించి..

  • ప్రభుత్వం స్వచ్ఛమైన మరియు అవినీతిరహితమైన పాలనకు కట్టుబడి ఉంది.
  • రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా సుమారు రూ.2,200 కోట్లు ఆదా చేశాం.
  • 100 కోట్లకుపైబడిన అన్ని టెండర్లను రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి ద్వారా పరిశీలించబడి కమిషన్‌ ద్వారా ఖరారు చేయబడుతుంది.
  • భూమి హక్కు గుర్తింపు చట్టం ద్వారా రిజిస్ట్రేషన్లలో అవకతవకలను భూ వివాదాలకు తావులేకుండా చేస్తున్నాం.
మూడు రాజధానులపై గవర్నర్

  • పరిపాలన వికేంద్రీకరణ అనేది కీలక అంశం
  • మూడు రాజధానులు ఏర్పాటు శాసన ప్రక్రియలో ఉంది 
  • శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది, ఆంగ్లమాధ్యమం గురించి

  • ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాం.
  • 97శాతం మంది తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకున్నారు.
  • ఇందులో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పడికీ త్వరలోనే తొలగిపోతాయి.
  • ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలను నియంత్రించడానికి చట్టం తీసుకొచ్చాం. జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ ఏర్పాటుచేశాం.
చారిత్రాత్మకమైన దిశ బిల్లును తీసుకొచ్చాం

  • మహిళలపై జరిగే నేరాలకు సత్వర విచారణ జరిపి 21 రోజుల్లో విచారణ జరిపేలా చట్టం
  • 18 దిశా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేశాం
  • దిశ చట్టం అమలుక ప్రత్యేక న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేస్తాం
మద్యపాన నిషేధం దిశగా అడుగులు
  • దశల వారీ మద్యం నిషేధం అమల్లో భాగంగా 43వేల బెల్ట్‌షాపుల తొలగించాం. 4,300 పర్మిట్‌ రూమ్‌లను తొలగించాం.

కరోనా, లాక్‌డౌన్‌, వలసకూలీల గురించి ప్రభుత్వం తీసుకుంటున్న‌ చర్యలు 
  • కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంది.
  • కరోనా పరీక్షల నిర్వహణలో ఇతర రాష్ట్రాలకంటే ఏపీ ముందుంది.
  • రోజుకు దాదాపు 15వేల పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 5.5 లక్షల పరీక్షలు పూర్తి చేశాం.
  • రాష్ట్రంలో మరణాల రేటు.. జాతీయ సగటు కంటే చాలా తక్కువ.
  • రికవరీ రేటు.. జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది.
  • ప్రభుత్వం టెస్టింగ్‌ ల్యాబ్‌లను 1 నుంచి 13కు పెంచింది.
  • రాష్ట్రంలో 5 ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రులున్నాయి.
  • కరోనా నివారణకు జిల్లాల్లో 65 ఆస్పత్రులు, 5,400 ఐసీయూ బెడ్స్‌, 38వేల ఐసోలేషన్‌ బెడ్స్‌, ఆక్సిజన్‌ సరఫరాతో 15వేల బెడ్స్‌ ఉన్నాయి.
  • లాక్‌డౌన్ సమయంలో రూ.వెయ్యి ఆర్ధిక సహాయంతో పాటు ఒక్కొక్కరికి 5కిలోల బియ్యం, కిలో పప్పు ఇచ్చాం.
  • వలసకూలీల సమస్యలను పరిష్కరించేందుకు 400 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి 1.2లక్షలకు పైగా వలస కూలీలకు ఆహారం వసతి అందించాం.
  • ఇతర రాష్ట్రాల్ల్లో చిక్కుకున్న 3.2లక్షల వలస కార్మికులను ఉచితంగా వారి గృహాలకు చేర్చాం, ఆర్టీసీ బస్సులు , శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని సొంత గ్రామాలకు తరలించాం.
  • కరోనా సమయంలో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ద్వారా రూ.2,200 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశాం, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు చర్యలు తీసుకున్నాం, వాలంటీర్ల ద్వారా నాలుగు విడతలుగా ఇంటించి సర్వే చేయించాం.

జగన్ లాంటి సీఎంతో పనిచెయ్యడం నా అదృష్టం - గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్



0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top