Saturday, June 28, 2014

కోనసీమ ఘటన మీద కుళ్ళు జోకులేస్తున్న ఈనాడు.


* మృత్యువు  నుంచి తెలుగువాడు తప్పించుకోవటం అసంభవం అని కార్టూన్ ల రూపంలో ఎగతాళి.

* ఒళ్ళు, ఇల్లు, మూగ జీవాలను  కాల్చుకొని కోనసీమ తెలుగు ప్రజలు హాస్పిటల్లో హా హా కారాలు చేస్తుంటే, పత్రికా రూపం లో భరోసా రాతలు రాయాల్సింది పోయి, ఆంధ్రోడిని  బట్టలూడదీసి కాలిన గాయాలతో బెడ్ మీద పడుకోబెట్టి కార్టూన్ ల రూపంలో సామాన్య ఆంధ్రోడి మీద  జోకులు వేయడం ఈ తెలంగాణా పచ్చ పత్రికకే చెల్లింది.

* నీ  తల్లో చెల్లో ఆ బాధితులలో ఉంటే గీసే వాడివా వేసే వాడివా ఇలాంటి బొమ్మలు ?

*ఇలాంటి పిచ్చి,పిచ్చి బొమ్మలూ రాతలు రాసి ప్రజాప్రతినిధులను ఎగతాళి చేసినందుకే TV9, ఆంధ్ర జ్యోతి ఛానళ్ళు అడ్డం గా మూసేసారు తెలంగాణలో.  ప్రజాప్రతినిధులను అవమాన పరిచారు కాబట్టే అంత తొందరగా గా చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ సామాన్య ప్రజలనుద్దేశించి పత్రికా రూపం లో భరోసా ఇవ్వాల్సిన సమయంలో, ఆంధ్రోడి మీద ఎన్ని అడ్డమైన గీతలూ, రాతలూ, బొమ్మలూగీసినా అడిగే నాధుడేడి? వీడు గీసిందే బొమ్మ రాసిందే రాత? ఇంకెన్నాళ్ళు భరించాలి ఇలాంటి పచ్చ పిచ్చి రాతలను??

  

No comments:

Post a Comment