fvz

Thursday, May 01, 2014

Digvijay Singh Second Marriage Affair With Tv Anchor Amrita Rai

దిగ్విజయ్ సింగ్ అంటే అంత త్వరగా గుర్తుపట్టడం కష్టం ఏమో కాని డిగ్గీ రాజా అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీగా ఉండి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని ఫాస్ట్ ఫార్వర్డ్ మోడులో పరుగెత్తించి కొత్త రాష్ట్రాన్ని దగ్గరుండి మరీ ఏర్పాటు చేయించిన డిగ్గీ సారు ఇప్పుడు పర్సనల్ లైఫులో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఆల్రెడీ మనుమరాళ్ళు ఉన్న ఈ పెద్దమనిషి ఇప్పుడు ఓ టీవీ యాంకరమ్మతో రెండో పెళ్లికి సిద్దమైపోయాడు. 68 ఏళ్ల లేటు వయసులో ఈయన గారి రొమాన్స్ ముచ్చట్లు ఇప్పుడు హాట్ టాపికుగా మారాయి. డిగ్గీ రాజా గారు అమృతా రాయ్ అనే రాజ్యసభ టీవీ యాంకరమ్మతో గత కొంత కాలంగా క్లోజుగా ఉండడమే కాకునా అక్రమ సంబంధం కూడా నడుపుతున్నారు. ఈ విషయం మీద రాజకీయ పార్టీలు కూడా దిగ్విజయ్‌ని విమర్శిస్తున్నాయి. అయితే ఈ మధ్య వీరు బెడ్ రూంలో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు తీయించుకున్న ఫొటోలు ఇంటర్‌ నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇక ఏముంది ఈ విషయం మీద తీవ్ర దుమారం రేగింది.
నిండా మునిగాక చలేంటి అనుకున్నాడో లేక అది ఎన్నాళ్ళు దాచినా దాగదు అనుకున్నాడో కాని డిగ్గీ తన వ్యక్తిగత విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా బయటపెట్టాడు. తనకు, అమృతాకి సంబంధం ఉన్న మాట నిజమే అని ఆమెని త్వరలో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అమృతా తన భర్తతో విడాకులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకుందని కోర్టు నుండి ఆ విడాకులు రాగానే పెళ్లి ఉంటుందని ట్విట్ చేశాడు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడరుగా చెలామణి అవుతూ, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా సేవలందించిన 68 సంవత్సరాల దిగ్విజయ్ సింగ్ ఇలా చేయడం అందరినీ షాక్కు గురి చేసింది. దిగ్విజయ్ సింఘుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉండగా ఆయన భార్య ఆశా సింగ్ గత ఏడాది అనారోగ్యంతో కన్ను మూసారు. లేటు వయసులో ఘాటు పెళ్లి... నువ్వు మాములోడివి కాదు డిగ్గీ...

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top